savitri: సావిత్రిని ఆ స్థితిలో చూసి నటి లక్ష్మికి గుండె బరువెక్కిందట!: సంజయ్ కిషోర్

  • సావిత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లారు 
  • ఆ విషయం తెలిసి హాస్పిటల్ కి లక్ష్మి వెళ్లారు. 
  • వరండాలో ఓ పక్కన పడుకోబెట్టిన సావిత్రిని చూసింది  

తాజాగా yoyo టీవీ ఇంటర్వ్యూలో సంజయ్ కిషోర్ మాట్లాడుతూ, సావిత్రి కోమాలోకి వెళ్లడానికి ముందు జరిగిన సంఘటనను గురించి ప్రస్తావించారు. "సావిత్రి వైభవం చాలా వరకూ తగ్గిపోయిన చివరి రోజుల్లో బెంగుళూర్ లో ఆమె ఒక సినిమాలో చిన్న పాత్ర ఏదో చేస్తున్నారు. అదే సినిమాలో నటిస్తోన్న సీనియర్ హీరోయిన్ లక్ష్మి షూటింగుకు వస్తూనే సావిత్రి గారిని గురించి అడిగారు. సావిత్రి గారు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టు అక్కడి వాళ్లు చెప్పారు".

 "దాంతో వెంటనే ఆమె అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి వార్డులన్నీ వెదుకుతున్నారు. అప్పుడు ఆమెకి వరండాలో కింద పడుకోబెట్టి వున్న సావిత్రి గారు కనిపించారు. అంతే .. ఆమె గుండె తరుక్కుపోయిందట. సావిత్రి గారంటే ఎవరనుకుంటున్నారంటూ గోల చేసి .. అక్కడి వాళ్లతో మాట్లాడి ఆమెను స్పెషల్ వార్డులో జాయిన్ చేశారు. ఈ విషయాన్ని రామానాయుడి గారి 'తోడి కోడళ్లు' సినిమా షూటింగు సమయంలో నాకు లక్ష్మి గారు చెప్పారు. ఇంతటి బరువైన ఈ సన్నివేశాన్ని 'మహానటి'లో పేలవంగా తీసినట్టుగా నాకు అనిపించింది" అని సంజయ్ కిషోర్ అన్నారు.     

More Telugu News