Odisha: ఒడిశా, మిజోరాం రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

  • ఒడిశా గవర్నర్ గా ప్రొఫెసర్ గణేశ్ జీ లాల్  
  • మిజోరం గవర్నర్ గా కుమ్మనమ్ రాజశేఖరన్
  • ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు

ఒడిశా, మిజోరాం రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. హర్యానా బీజేపీ నేత, ప్రొఫెసర్ గణేశ్ జీ లాల్ ని ఒడిశా గవర్నర్ గా, కేరళ బీజేపీ చీఫ్ కుమ్మనమ్ రాజశేఖరన్ ని మిజోరాం గవర్నర్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా,  ప్రస్తుతం ఒడిశా గవర్నర్ గా అదనపు బాధ్యతలను బీహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నిర్వర్తిస్తున్నారు. మిజోరాం గవర్నర్ గా ఉన్న నిర్భయ్ శర్మ పదవీ కాలం ఈ నెల 28వ తేదీతో ముగియనుంది. 

More Telugu News