రాకెట్ ఇంధనంతో కోహ్లీని ఆడించలేం: రవిశాస్త్రి
- కోహ్లీ కూడా మనిషే.. యంత్రం కాదన్న శాస్త్రి
- ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ మెడకు గాయం
- దీంతో, కౌంటీల నుంచి తప్పుకున్న కోహ్లీ
ఈనెల 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఫీల్డింగ్ సందర్భంగా కోహ్లీ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విరాట్ మెడకు గాయం అయింది. జూన్ 15వ తేదీన బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీలో కోహ్లీ ఫిట్ నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. అక్కడ ఫిట్ నెస్ ను నిరూపించుకుంటే... ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ కు టీమిండియాతో కలిసి బయల్దేరుతాడు.