Andhra Pradesh: బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలుస్తాం: నారా లోకేష్

  • ఇకపై బీజేపీ ఎక్కడా గెలవదు
  • అన్ని పార్టీలూ ఏకం కావాల్సిన సమయం ఇదే
  • ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచన
  • వెల్లడించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీతో అయినా కలసి పనిచేసేందుకు సిద్ధమేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇకపై బీజేపీ ఏ రాష్ట్రంలోనూ గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. బీజేపీపై పోరాడేందుకు అన్ని పార్టీలూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

ఏపీలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానించే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని తెలిపారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారని, ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తేనే బీజేపీకి బుద్ధి చెప్పేందుకు వీలవుతుందని అన్నారు.

More Telugu News