gold: 120 రూపాయలు పెరిగిన బంగారం ధర

  • పెరిగిన డిమాండ్
  • 10 గ్రా.ల పసిడి ధర రూ.120 పెరిగి.. రూ.32 వేలుగా నమోదు
  • కిలో వెండి రూ.300 పెరిగి రూ.41,400కి చేరిక

బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు పసిడి ధర పెరిగింది. పది గ్రాములు పసిడి రూ.120 పెరిగి, రూ.32 వేలుగా నమోదైంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక బంగారు ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో బంగారం ధరలు పెరిగాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

 మరోవైపు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ పెరగడంతో వెండి ధర కూడా పైకి ఎగిసింది. కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.41,400కి చేరింది. ఇక గ్లోబల్‌ మార్కెట్‌లో పసిడి ధర 0.12 శాతం పెరిగి సింగపూర్‌ మార్కెట్‌లో ఔన్సు ధర 1,292.20 డాలర్లుగా నమోదైంది.

More Telugu News