Chandrababu: చంద్రబాబు ఇంట్లో తనిఖీలు చేబడితే ఆ ఆభరణాలు బయటపడతాయి!: విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు

  • 12 గంటల్లోపల చంద్రబాబు నివాసాల్లో తనిఖీలు చేయాలి
  • లేకపోతే ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయి
  • హెరిటేజ్ తో ఇన్ని ఆస్తులు కూడబెట్టడం అసాధ్యం

తిరుమల పోటు నేలమాళిగలోని విలువైన ఆభరణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్, అమరావతిలలో ఉన్న తన నివాసాలకు తరలించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 12 గంటల్లోపల చంద్రబాబు నివాసాల్లో సీబీఐ లేదా తెలంగాణ పోలీసులతో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయటపడతాయని చెప్పారు.

చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే తన పదవికి వెంటనే రాజీనామా చేస్తానని అన్నారు. 12 గంటల కంటే ఎక్కవ సమయం ఇస్తే... ఆ ఆభరణాలన్నీ విదేశాలకు తరలిపోతాయని చెప్పారు. కేవలం హెరిటేజ్ సంస్థల వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులను కూడబెట్టడం అసాధ్యమని అన్నారు. లోకేష్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు... సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. 

More Telugu News