ap express: రైలు ప్రమాదం నుంచి బయటపడ్డ 36 మంది ట్రైనీ ఐఏఎస్ లు!

  • గ్వాలియర్ వద్ద అగ్నిప్రమాదానికి గురైన ఏపీ ఎక్స్ ప్రెస్
  • కాలిపోయిన బోగీల్లో 65 మంది విశాఖ ప్రయాణికులు
  • ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరిన రైలు

ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ (రాజధాని) ఎక్స్ ప్రెస్ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండు బోగీలు కాలిపోయాయి. తాజాగా ప్రమాదానికి సంబంధించిన విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో రెండు కోచ్ లలో 65 మంది విశాఖ ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 36 మంది ట్రైనీ ఐఏఎస్ లు కూడా ఉన్నారు. అయితే, అందరూ కూడా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖకు రైలు బయల్దేరింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడటంతోనే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

More Telugu News