Hyderabad: వీడిన ఖైరతాబాద్ మర్డర్ మిస్టరీ... రూ. 3 వేల కోసం స్నేహితులే చంపేశారు!

  • గంటల వ్యవధిలోనే కేసును తేల్చి పోలీసులు
  • భార్యకు చెయ్యి తగిలిందన్న ఆగ్రహంతో హత్య
  • నిందితులను అరెస్ట్ చేశామన్న పోలీసులు

ఖైరతాబాద్ లో శనివారం అర్ధరాత్రి హత్యకు గురైన శివకిరణ్ కేసులో మిస్టరీని గంటల వ్యవధిలోనే పోలీసులు తేల్చారు. శివకిరణ్ ను హత్య చేసింది అతని మిత్రులేనని, రూ. 3 వేలు ఇవ్వకుండా తప్పించుకునేందుకు ఈ హత్య జరిగిందని చెప్పారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా నందికొట్కూరు ప్రాంతానికి చెందిన గంగుల శివకిరణ్ పాత నేరస్తుడు. ఈ నెల 16వ తేదీన మిత్రులతో కలసి మందు పార్టీ చేసుకోగా, రహ్మాన్ అనే వక్తి శివకుమార్ మిత్రుడు కన్నాపై మత్తులో దాడికి దిగాడు.

ఆపై స్నేహితులు కలసి పంచాయతీ పెట్టి, దాడి చేసినందుకు రహ్మాన్ రూ. 3 వేలు ఇవ్వాలని తేల్చారు. ఇక కన్నాకు ఇవ్వాల్సిన రూ. 3 వేల కోసం నిత్యమూ శివకిరణ్, రెహ్మాన్ ను అడుగుతూ ఉండటంతో శనివారం రాత్రి 10.30గంటల సమయంలో పిలిచి రూ. వెయ్యి ఇచ్చాడు. మిగతా రెండు వేల కోసం ఘర్షణ జరుగగా, రెహ్మాన్ భార్యకు శివకిరణ్ చెయ్యి తగిలిందన్న ఆగ్రహంతో, తన మిత్రులు అజ్జూ, జావిద్, మొహియుద్దీన్ సాయంతో శివకిరణ్ ను హత్య చేశాడు రెహ్మాన్. ఈ కేసులో 12 గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

More Telugu News