without father: సరికొత్త చరిత్ర.. దేశంలో తండ్రి లేని తొలి బిడ్డగా తావిసి పెరారా రికార్డు!

  • భర్తతో విడిపోయిన అనంతరం వీర్య దాత ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
  • బర్త్ సర్టిఫికెట్‌లో తండ్రి పేరు రాసిన అధికారులు
  • తొలగించాల్సిందిగా కోర్టుకెక్కి విజయం సాధించిన మధుమిత

దేశంలో తండ్రి లేని తొలి బిడ్డగా తమిళనాడుకు చెందిన తావిసి పెరారా రికార్డులకెక్కింది. తావిసి బర్త్ సర్టిఫికెట్‌లో తండ్రి కాలమ్‌ను ఖాళీగా వదిలిపెట్టాలని మద్రాస్ హైకోర్టు అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తావిసి తల్లి మధుమిత రమేష్ భర్త చరణ్ రాజ్‌తో పరస్పర అంగీకారంతో వేరుపడింది. అనంతరం ఓ వీర్య దాత ద్వారా మధుమిత ఏప్రిల్ 2017లో తావిసికి జన్మనిచ్చింది. త్రిచి కార్పొరేషన్ అధికారులు తావిసికి బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తూ మనీష్ మదన్‌పాల్ మీనాను చిన్నారి తండ్రిగా పేర్కొన్నారు. సంతానోత్పత్తి చికిత్స కోసం మధుమితకు ఆయన సాయం చేయడంతో అతడి పేరును బర్త్ సర్టిఫికెట్‌లో చేర్చారు.

అయితే, తావిసి తండ్రిగా మనీష్‌ను పేర్కొన్నడాన్ని నిరసిస్తూ దానిని తొలగించాల్సిందిగా మధుమిత అధికారులను కోరారు. అందుకు అధికారులు నిరాకరించడంతో గతేడాది సెప్టెంబరు 4న మధుమిత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు సర్టిఫికెట్‌ను సవరించాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అయితే, రెవెన్యూ డివిజనల్ అధారి మరోమారు ఆ దరఖాస్తును తిరస్కరించారు. దీంతో మధుమిత మరోమారు కోర్టును ఆశ్రయించారు. దీంతో తండ్రి కాలమ్‌ నుంచి మనీష్ పేరును తొలగించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

మరోవైపు తావిసి తండ్రిని తాను కాదంటూ మనీష్, మధుమిత నుంచి విడిపోయిన భర్త చరణ్ రాజ్‌లు విడివిడిగా కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేశారు. దీంతో స్పందించిన జస్టిస్ ఎంఎస్ రమేష్ నేతృత్వంలోని ధర్మాసనం త్రిచీ కార్పొరేషన్ ముఖ్య వైద్యాధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆమె వీర్య దాత ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి సర్టిఫికెట్ నుంచి మనీష్ పేరును తొలగించాలని ఆదేశించింది. ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా తండ్రి పేరు లేకుండా బర్త్ సర్టిఫికెట్ జారీ కానున్న తొలి చిన్నారిగా తావిసి రికార్డులకెక్కనుంది.

  • Loading...

More Telugu News