yeddyurappa: ఎమ్మెల్యేలను కొనే పనిలో యడ్డీ కుమారుడు.. సాక్ష్యాలు విడుదల చేసిన కాంగ్రెస్

  • యడ్యూరప్ప కుమారుడు ప్రలోభాలకు పాల్పడ్డారన్న కాంగ్రెస్
  • రూ. 5 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేశారంటూ ఆరోపణ
  • ఆడియో సాక్ష్యం విడుదల

తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆరోపించింది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ప్రలోభాలకు పాల్పడ్డారని తెలిపింది. తమ ఎమ్మెల్యేలకు రూ. 5 కోట్లు, మంత్రి పదవిని ఆఫర్ చేశారని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఓ ఆడియో సాక్ష్యాన్ని విడుదల చేసింది. ఇందులో విజయేంద్ర మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఈ సాయంత్రం బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఆడియో సంచలనంగా మారింది.

నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే దద్దల్ తో గాలి జనార్దనరెడ్డి మాట్లాడినట్టుగా ఉంది. బీజేపీకి మద్దతు పలికితే... మీ జీవితం సెటిల్ అయిపోతుంది అంటూ గాలి సూచించడం ఇందులో ఉంది.

More Telugu News