jena sena: ‘జ‌న‌సేన’ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా తోట చంద్ర‌శేఖ‌ర్‌ ను నియమించాం: పవన్ కల్యాణ్

  • ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా చంద్రశేఖర్ త్వ‌ర‌లోనే ప్ర‌మాణ‌స్వీకారం చేస్తారు
  • ఈ కార్యక్రమం అమ‌రావ‌తిలో నిర్వహిస్తాం
  • చంద్ర‌శేఖ‌ర్‌కు పార్టీ శ్రేణులు స‌హ‌కరించాలి

జ‌న‌సేన పార్టీ  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్ర‌ముఖ రాజ‌కీయ‌వేత్త, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్ర‌శేఖ‌ర్‌ను నియమించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేసింది. గ‌త ప‌దేళ్లుగా చంద్ర‌శేఖ‌ర్‌తో తనకు వ్య‌క్తిగ‌త సాన్నిహిత్యం ఉందని, ఆయన మంచి ప‌రిపాల‌నాద‌క్షుడే కాకుండా విజ‌య‌వంత‌మైన పారిశ్రామికవేత్త కూడా అని చెప్పారు.

పౌర పరిపాల‌న‌లో ఆయ‌న‌కున్న ప‌ట్టు, శ‌క్తిసామ‌ర్ధ్యాలు అపార‌మైన‌వని, చంద్ర‌శేఖ‌ర్‌ దీక్షాద‌క్ష‌త పార్టీని మ‌రింత విస్తృత ప‌రచడానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా తోట చంద్రశేఖర్ త్వ‌ర‌లోనే ప్ర‌మాణ‌స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్వహిస్తామని చెప్పారు. చంద్ర‌శేఖ‌ర్‌కు పార్టీ శ్రేణులు సంపూర్ణ స‌హాయ స‌హ‌కారాలు అందిస్తార‌ని ఆశిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


 

  • Loading...

More Telugu News