Karnataka: కర్ణాటక ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే బోపయ్య

  • ఈ మేరకు గవర్నర్ ఆదేశాలు
  • కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్న బోపయ్య
  • ఈ నియామకంపై మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు

కర్ణాటక అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేజే బోపయ్యను ఎంపిక చేశారు. అంతకుముందు, న్యాయ నిపుణులతో కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ చర్చించారు. ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమిస్తూ గవర్నర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో ప్రొటెం స్పీకర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాగా, అసెంబ్లీ స్పీకర్ గా బోపయ్య గతంలో పనిచేశారు. ఇప్పుడు విరాజ్ పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇదిలా ఉండగా, ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.
ఎక్కువ సీనియార్టీ ఉన్న తమ ఎమ్మెల్యే  దేశ్ పాండేను నియమించకుండా బోపయ్యను ఎలా నియమిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు దేశ్ పాండే 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కాగా, రేపు సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విశ్వాస పరీక్షను ప్రొటెం స్పీకర్ బోపయ్య నిర్వహించనున్నారు. బీజేపీ సంఖ్యాబలం 104 కాగా, కాంగ్రెస్ కు78, జేడీఎస్ కు 36, ఇతరులు ముగ్గురు ఉన్నారు. బలపరీక్ష గట్టెక్కేందుకు బీజేపీకి కావాల్సిన సంఖ్యాబలం 112.  

  • Loading...

More Telugu News