keerti suresh: నైజామ్ లో దూసుకుపోతోన్న 'మహానటి'

  • 'మహానటి'కి అన్ని ప్రాంతాల్లో విశేషమైన ఆదరణ
  • నైజామ్ ఏరియాలో భారీ వసూళ్లు 
  • 9 రోజుల్లో 5.89 కోట్ల షేర్      

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలో ఈనెల 9వ తేదీన 'మహానటి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విశేషమైన ఆదరణ పొందుతోంది. సావిత్రికి గల క్రేజ్ అందరినీ థియేటర్స్ కి రప్పిస్తోంది. ఆమె జీవితంలోని విషాదం .. అందుకు దారితీసిన పరిస్థితులను గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ కారణంగానే ఈ సినిమా ఎంతమాత్రం జోరు తగ్గకుండా దూసుకుపోతోంది.

 ముఖ్యంగా నైజామ్ లో భారీ వసూళ్లను రాబడుతోంది. 5 రోజుల్లో 3.47 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా, 9 రోజులకు 5.89 కోట్ల షేర్ ను సాధించింది. కథానాయిక ప్రాధాన్యత గల సినిమాకి ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషమని అంటున్నారు. దగ్గరలో చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడం వలన, మరింతగా వసూళ్లు పెరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.  

More Telugu News