balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ కోసం రంగంలోకి క్రిష్

  • క్రిష్ పై దృష్టి పెట్టిన బాలకృష్ణ
  • 'మణికర్ణిక' తరువాత రంగంలోకి క్రిష్ 
  • ఈలోగా వినాయక్ తో బాలకృష్ణ  

ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి బాలకృష్ణ గట్టి ప్రయత్నాలే చేశాడు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తేజ తప్పుకోవడంతో, బాలకృష్ణ ఆలోచనలో పడ్డారు. ఒకానొక దశలో తానే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను చేపట్టాలని నిర్ణయించుకుని, పర్యవేక్షణ బాధ్యతను రాఘవేంద్రరావుకు అప్పగించాలని భావించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఒక వైపున దర్శక నిర్మాతగాను .. మరో వైపున నటన పైన దృష్టి పెట్టడం కష్టమవుతుందని సన్నిహితులు చెప్పడంతో వెనక్కి తగ్గారు.

 గతంలో క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ 'గౌతమీ పుత్ర శాతకర్ణి'  చేసి విజయాన్ని అందుకున్నారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది ..  పైగా క్రిష్ భారీ సినిమాలు డీల్ చేయగల సమర్ధుడనే విషయం బాలకృష్ణకి బాగా తెలుసు. అందువలన ఆయనకి ఈ సినిమా బాధ్యతలను అప్పగించినట్టు సమాచారం. ప్రస్తుతం 'మణికర్ణిక' పనులతో క్రిష్ బిజీగా వున్నాడు. అందువలన ఆగస్టులో ఆ సినిమాను విడుదల చేసి, ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ పై దృష్టి పెడతాడని చెబుతున్నారు. ఈ లోగా బాలకృష్ణ .. వినాయక్ తో ఒక సినిమాను కానిచ్చేస్తాడన్న మాట.  
 


 


More Telugu News