england: ఇంగ్లండ్ లో భారత సంతతి మహిళను వెంటాడి చంపిన దుండగుడు

  • మిడిల్స్ బరో పట్టణంలో దారుణం
  • యూనివర్శిటీలో ప్రేమ వివాహం చేసుకున్న జెస్సికా
  • హంతకుడి కోసం గాలిస్తున్న పోలీసులు

ఉత్తర ఇంగ్లండ్ లోని మిడిల్స్ బరో పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫార్మసిస్టుగా పని చేస్తున్న జెస్సికా పటేల్ అనే భారత సంతతి మహిళను గుర్తు తెలియని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. ఆమెను వెంటాడి చంపినట్టు పోలీసులు తెలిపారు. హంతకుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... జెస్సికా, మితేష్ దంపతులు గత మూడేళ్లుగా మిడిల్స్ బరోలో ఫార్మసీని నడుపుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్ లో చదుకునే సమయంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

మరోవైపు హత్యకు గల కారణాన్ని ఇప్పటికిప్పుడే వెల్లడించలేమని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఎవరి వద్ద అయినా ఎలాంటి సమాచారం ఉన్నా... వెంటనే తమకు అందించాలని కోరారు. జెస్సికా నివాసం ఉండే రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుందని... దీంతో, ఆధారాలను సేకరించడం క్లూస్ టీమ్ కు కష్టంగా మారిందని చెప్పారు. 

More Telugu News