Chandrababu: కాబోయే భర్తతో కలసి చంద్రబాబును కలిసిన భూమా అఖిలప్రియ

  • పెళ్లికి రావాలని ఆహ్వానించిన అఖిలప్రియ
  • ఇద్దరినీ ఆశీర్వదించిన చంద్రబాబు
  • ఆగస్ట్ 29న ఆళ్లగడ్డలో అఖిలప్రియ వివాహం

ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లిపీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాదులో ఆమె వివాహ నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ ను ఆమె పెళ్లాడబోతున్నారు. గత కొంత కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, తన కాబోయే భర్త భార్గవ్ తో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె కలిశారు. ఆగస్ట్ 29న తమ వివాహం ఆళ్లగడ్డలో జరగనుందని, రావాలని కోరారు. ఈ సందర్భంగా ఇద్దరినీ ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. వరుడి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా వారి వెంట ఉన్నారు.

More Telugu News