Karnataka: మాలో ఎలాంటి చీలిక లేదు... బీజేపీకి షాకిచ్చిన రేవణ్ణ!

  • మీడియా ముందుకు వచ్చిన రేవణ్ణ 
  • జేడీఎస్ ఎల్పీనేతగా కుమారస్వామిగౌడను ఎన్నుకున్నాం
  • పార్టీ నుంచి చీలతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

జేడీఎస్ శాసన సభాపక్షనేతగా కుమారస్వామిగౌడను ఎన్నుకున్నామని, తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని రేవణ్ణ స్పష్టం చేశారు. జేడీఎస్ ఎల్పీ నేతగా ఎన్నికైన కుమారస్వామితో కలిసి రేవణ్ణ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జేడీఎస్ నుంచి చీలతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పారు. జేడీఎస్ ఎల్పీ నేతగా ఎన్నికైన కుమారస్వామిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.


More Telugu News