kalyan ram: లవ్ .. ఎమోషన్ కలయికగా 'నా నువ్వే' ట్రైలర్

  • కల్యాణ్ రామ్ హీరోగా 'నా నువ్వే'
  • కథానాయికగా తమన్నా 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  

కల్యాణ్ రామ్ హీరోగా తమన్నా కథానాయికగా 'నా నువ్వే' సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. ఎమోషన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, అందుకు సంబంధించిన సన్నివేశాలపై ట్రైలర్ ను కట్ చేశారు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ కావడంతో, ఆ యాంగిల్ లోనే యూత్ కి నచ్చేలా ఈ ట్రైలర్ ను వదిలారు.

దర్శకుడు జయేంద్ర ఈ ట్రైలర్ ద్వారా కంటెంట్ ను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. డిఫరెంట్ లుక్ తో కల్యాణ్ రామ్ కనిపిస్తూ ఉంటే, తమన్నా మరింత గ్లామర్ గా అనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొంతకాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న కల్యాణ్ రామ్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి. తమన్నాకి అవకాశాలు తగ్గిన నేపథ్యంలో, ఈ సినిమా సక్సెస్ ఆమెకి కూడా చాలా అవసరమే. 

More Telugu News