godavari: గోదావరిలో 30 మందితో వెళుతూ మునిగిపోయిన లాంచీ.. పలువురి గల్లంతు?

  • రాజమహేంద్రవరం వెళుతుండగా ప్రమాదం
  • లాంచీలో పెళ్లి బృందం కూడా
  • ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చిన ఐదుగురు

గోదావరిలో ఓ లాంచీ మునిగిపోయిన ఘటన అలజడి రేపుతోంది. కొండమొదలు నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా దేవీపట్నం వద్ద ఆ లాంచీ ఒక్కసారిగా తిరగబడి మునిగిపోయిట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో లాంచీలో సుమారు 30 మంది ఉండగా, అందులో ఐదురుగు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం తర్వాత దేవీపట్నం పోలీసులకు లాంచీ నిర్వాహకుడు ఖాజా లొంగిపోయాడు. ఆ లాంచీలో పెళ్లి బృందం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

More Telugu News