Karnataka: సిద్ధరామయ్య కార్యాలయానికి తాళం.. ఫొటో వైరల్!

  • విధాన సౌధలోని సిద్ధరామయ్య కార్యాలయానికి తాళం
  • సామాజికమాధ్యమాల్లో అందుకు సంబంధించిన ఫొటో
  • సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్-జేడీఎస్?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన సిద్ధరామయ్య బాదామిలో విజయం సాధించగా, చాముండేశ్వరలో అపజయం పాలయ్యారు. బాదామిలో కూడా అతికష్టం మీద ఆయన విజయం సాధించాల్సి వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో, బీజేపీ 104, కాంగ్రెస్ 77, జేడీఎస్ 37 స్థానాల్లో గెలుపు సాధించాయి.

కాంగ్రెస్ -జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేేసే విషయమై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. సీఎంగా కుమారస్వామి, డిప్యూటీ సీఎంగా పరమేశ్వరన్ బాధ్యతలు తీసుకునేలా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇక సిద్ధరామయ్య ఏ పదవీ తీసుకోరన్న వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విధాన సౌధలోని సీఎం సిద్ధరామయ్య కార్యాలయానికి తాళం వేస్తుండగా తీసిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది.

More Telugu News