Karnataka: కాసేపట్లో గవర్నర్‌కి రాజీనామా లేఖ ఇవ్వనున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

  • జేడీఎస్‌కి కాంగ్రెస్‌ మద్దతు
  • గవర్నర్‌కు తెలపనున్న సిద్ధరామయ్య 
  • రసవత్తరంగా మారిన కర్ణాటక రాజకీయం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడుతోన్న విషయం విదితమే. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో బీజేపీ 103 స్థానాల్లో గెలుపొంది, 1 స్థానంలో లీడ్‌లో ఉండగా కాంగ్రెస్‌ 73 స్థానాల్లో గెలిచి 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా, జేడీఎస్‌కు మద్దతిస్తామని ఇప్పటికే ప్రకటన చేసిన సిద్ధరామయ్య కాసేపట్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆయన గవర్నర్‌ వద్దకు బయలుదేరారు. అలాగే, కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరనున్నారు. నిమిష నిమిషానికి మారుతోన్న రాజకీయాలతో కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. 

  • Loading...

More Telugu News