yadyurappa: ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం: మీడియా ముందుకు వచ్చిన యడ్యూరప్ప

  • తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
  • ఇంకా ఫలితాలు రావాల్సి ఉందన్న యడ్యూరప్ప
  • కాంగ్రెస్‌-జేడీఎస్‌లపై స్పందించబోనని వ్యాఖ్య

తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కక పోవడంతో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ అవుతోంది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటన చేసిన నేపథ్యంలో బీజేపీ నేతలు నిరాశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతోన్న విషయంపై బీజేపీ కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప స్పందించారు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ... ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని, తాము అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయన్న వార్తలపై స్పందించాలని కోరగా తాను ఆ రెండు పార్టీల గురించి ఇప్పుడు స్పందించాలనుకోవడం లేదని చెప్పారు.

More Telugu News