తెరచుకున్న పెట్టెలు... తొలి ఆధిక్యం జేడీఎస్ కు!
- పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
- ఆధిక్యంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర
- రామనగరంలో కుమారస్వామి ముందంజ
ప్రస్తుతం 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ట్రెండ్స్ వెలువడుతుండగా, కాంగ్రెస్ 6, బీజేపీ 7, జేడీఎస్ 4 చోట్ల ఆధిక్యం చూపుతున్నాయి. హోలెనరాసిపురాలో జేడీఎస్ అభ్యర్థి హెచ్డీ రేవణ్ణ ఆధిక్యంలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. హరప్పనహళ్ళిలో బీజేపీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి, రామనగరంలో జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామి, వరుణలో సిద్ధరామయ్య కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి యతీంద్ర ఆధిక్యంలో ఉన్నారు.