central cabnet: కేంద్ర మంత్రి వర్గంలో స్వల్ప మార్పులు!

  • కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి స్మృతీకి స్వస్తి
  • ఆ శాఖ బాధ్యతలు చూడనున్న రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
  • జైట్లీ కోలుకునే వరకు పీయూష్ గోయల్ కు అదనపు బాధ్యతలు
  • ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖా మంత్రి  ఆల్ఫోన్స్ థానమ్ కు ఉద్వాసన

కేంద్ర మంత్రి వర్గంలో స్వల్ప మార్పులు చోటుచేకున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యతల నుంచి స్మృతీ ఇరానీని తప్పించారు. ఆ శాఖ బాధ్యతలను రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కు అప్పగించారు. అయితే, స్మృతీ ఇరానీ జౌళి శాఖకు కూడా మంత్రిగా ఉన్నారు. ఆ శాఖకు మాత్రమే ఆమె మంత్రిగా కొనసాగనున్నారు.

కాగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు కిడ్నీమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకునే వరకు ఆ శాఖ వ్యవహారాలను చూడాలంటూ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ఆల్ఫోన్స్ థానమ్ ను తప్పించారు. ఎలక్ట్రానిక్స్ శాఖ బాధ్యతలను ఎస్ఎస్ అహ్లూవాలియాకు అప్పగించారు.

More Telugu News