Jagan: అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేసింది వైఎస్ అనుచరుడు కోలా ఆనంద్ మనుషులే!: కేఈ ఆరోపణ

  • బీజేపీ-వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయి
  • బీజేపీ నేతలపై వాలిన ఈగలను తోలే బంట్రోతు జగన్
  • జగన్ కు ప్రజలు తగినబుద్ధి చెబుతారు

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేతలపై వాలిన ఈగలను తోలే బంట్రోతు జగన్ అని, ఆ పార్టీకి అద్దె మైకుగా ఆయన వ్యవహరిస్తున్నారని అన్నారు. అమిత్ షా కాన్వాయ్ పై చంద్రబాబు దాడి చేయించాడన్న జగన్ వ్యాఖ్యలను చూస్తుంటే, బీజేపీ-వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని తెలుస్తోందని అన్నారు. అలిపిరిలో అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేసింది వైఎస్ అనుచరుడైన కోలా ఆనంద్ మనుషులేనని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్ కు ప్రజలు తగినబుద్ధి చెబుతారని అన్నారు.

More Telugu News