Tollywood: టాలీవుడ్‌లో మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోయాయి.. త్వరలో ఢిల్లీకి వెళతాం: ఫిర్యాదు చేసిన శ్రీరెడ్డి

  • తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కు ఫిర్యాదు
  • జాతీయ మహిళా కమిషన్‌ను కూడా కలవనున్న శ్రీరెడ్డి
  • టాలీవుడ్‌లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం ఉందని ఆరోపణ

స్త్రీల సమస్యలపై పోరాటం చేస్తానని ప్రకటించుకున్న యువ నటి శ్రీరెడ్డి ఈ రోజు మహిళా సంఘాలతో కలిసి తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ త్రిపురాన వెంకటరత్నం వద్దకు వచ్చి మూడు గంటలు చర్చించారు. అలాగే, టాలీవుడ్‌లో మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోయాయని ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో త్వరలో తాము ఢిల్లీకి వెళ్లి జాతీయ మహిళా కమిషన్‌ను కూడా కలిసి పిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా మీడియాకు శ్రీరెడ్డి తెలిపారు. అలాగే, టాలీవుడ్‌లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతోందని తెలిపిన మహిళా సంఘాల నేతలు.. ఆ కారణంగా ఏ సమస్యలు ప్రస్తావించినా పరిష్కారం దొరకటం లేదని తెలిపారు.

More Telugu News