Tollywood: 'మహానటి' నా హృదయంలో చిరకాలం నిలిచిపోతుంది!: ‘లోక్ సత్తా’ జేపీ

  • మహానటి’ సినిమా చూశా .. ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు
  • ఈ చిత్రం గొప్పనటికి జీవం పోసింది
  • కన్నీరు ఆపుకోవడం కష్టం!

అలనాటి అద్భుత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. ఈ చిత్రం చాలా బాగుందంటూ ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా, ‘లోక్ సత్తా’ అధినేత జయప్రకాష్ నారాయణ ఈ సినిమా గురించి ప్రస్తావించారు.

‘‘మహానటి’ సినిమా చూశాను. అసామాన్య నటి సావిత్రిపై ఎంతో ప్రేమతో ఈ బయోపిక్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, తెర వెనుక పని చేసిన బృందం, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఎంతో గొప్పగా పని చేశారు. ఈ చిత్రం గొప్పనటికి జీవం పోసింది .. కన్నీరు ఆపుకోవడం కష్టం. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన కీర్తి సురేశ్, సమంతాలు అద్భుత నటన ప్రదర్శించారు.. నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా ఎంతో కదలించి వేసింది .. భావోద్వేగం చెందేలా చేసింది. నా హృదయంలో చిరకాలం నిలిచిపోతుంది’ అని జేపీ ప్రశంసలు కురిపించారు.

More Telugu News