keerti suresh: ఓవర్సీస్ లో 'మహానటి' జోరు

  • నిన్ననే విడుదలైన 'మహానటి'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ 
  • ఓవర్సీస్ లోను నీరాజనాలు

సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి' సినిమా తెరకెక్కింకిది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలలో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తెలుగులో విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అలనాటి కథానాయికలలో ముందుగా కనిపించే సావిత్రిని అభిమానించే వారి సంఖ్య సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ తరం వారికి సావిత్రిని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఆయా పాత్రలు చేసినవారు ఈనాటి క్రేజీ ఆర్టిస్టులు కావడం వాళ్ల ఆసక్తికి మరో కారణం. అందువలన తొలి రోజునే ఈ సినిమా అక్కడ హాఫ్ మిలియన్ మార్క్ ను చేరుకుందని సమాచారం. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ తో యూనిట్ ఫుల్ ఖుషీగా వుంది. 

  • Loading...

More Telugu News