KCR: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమస్యలపై ఈ నెల 14న నిర్ణయం: ముఖ్యమంత్రి కేసీఆర్

  • ఉద్యోగుల, ఉపాధ్యాయుల అంశాలపై ఏర్పాటైన మంత్రుల కమిటీ
  • ఈ నెల 11వ తేదిన సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పణ
  • అధికారులతో చర్చించి ఈ నెల 14వ తేదిన నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్

ఉద్యోగుల, ఉపాధ్యాయుల అంశాలకు సంబంధించి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఈ నెల 11వ తేదీన సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి నివేదికను రూపొందిస్తోంది. కాగా, మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో చర్చించి ఈ నెల 14వ తేది మధ్యాహ్నం 2 గంటలకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.

More Telugu News