bjp: బీజేపీకి మాజీ మంత్రి మారెప్ప రాజీనామా.. కాంగ్రెస్ లో చేరిక

  • మళ్లీ సొంతగూటికే చేరిన మారెప్ప
  • బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం 
  • బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించిన మారెప్ప

బీజేపీకి మాజీ మంత్రి మారెప్ప గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ అధిష్ఠానానికి పంపారు. మళ్లీ తన సొంతగూటి (కాంగ్రెస్ పార్టీ) కే మారెప్ప చేరారు. కర్ణాటకలోని బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న మారెప్ప మాట్లాడుతూ, సిద్ధరామయ్య పనితీరు బాగుందని ప్రశంసించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 120 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ తీరుపై కర్ణాటకలోని తెలుగు వాళ్లు మండిపడుతున్నారని, ప్రత్యేక హోదా ప్రభావం ఈ ఎన్నికలపై ఉంటుందని చెప్పారు. కాగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన మారెప్ప గతంలో కాంగ్రెస్, వైసీపీలలో పని చేశారు. ఈ రెండు పార్టీల్లోనూ ఆయన ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు. కానీ, బీజేపీలో చేరిన తర్వాత ఆయన మౌనంగా ఉండిపోయారు.

More Telugu News