East Godavari District: తుని రైల్వేస్టేషన్ లో మృతదేహం!

  • రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఓ మూటను గుర్తించిన పోలీసులు
  • ఆ మూటలో మహిళ మృతదేహం
  • మూడు రోజుల క్రితమే హత్య చేసి ఉంటారని అనుమానం

తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ లో మృతదేహం కలకలం రేపుతోంది. రిజర్వేషన్ కౌంటర్ వద్ద పడేసి ఉన్న ఓ మూటను రైల్వే పోలీసులు ఈరోజు ఉదయం గుర్తించారు. ఆ మూటలో నుంచి రక్తం కారుతున్న విషయాన్ని పోలీసులు తమ ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో ఉన్నతాధికారుల సమక్షంలో పోలీసులు ఆ మూటను విప్పి చూడగా .. నైటీలో ఉన్న మహిళ మృతదేహం బయటపడింది. మూడు రోజుల క్రితమే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News