raviteja: 'నేల టిక్కెట్టు' ఆడియో వేడుకకి వేదిక ఖరారు

  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు'
  • రవితేజకు జోడీగా మాళవిక శర్మ  
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు    

రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు' సినిమా రూపొందింది. మాళవిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో వేడుకతో అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించడానికి సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్.. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో, ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను ఆరంభించనున్నారు. అభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకకి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నాడు. దర్శకుడిగా కల్యాణ్ కృష్ణ ఇప్పటికే రెండు హిట్లు కొట్టేసి వున్నాడు. అందువలన ఆయన ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఇక ఈ సినిమా తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని మాళవిక శర్మ భావిస్తోంది. ఆమె ఆశ నెరవేరుతుందేమో చూడాలి మరి.     

  • Loading...

More Telugu News