kcr: తెరపైకి మళ్లీ 'ఓటుకు నోటు కేసు'.. డీజీపీ, న్యాయశాఖ కార్యదర్శితో కేసీఆర్ సమీక్ష

  • మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు
  • ఆధారాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికపై కేసీఆర్ ఆరా
  • రెండు గంటలకు పైగా సమీక్ష

సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సమీక్ష నిర్వహించారు. కేసు పురోగతి వివరాలను తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించి లభించిన ఆధారాలు, వాయిస్ రికార్డ్, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ నివేదికపై కేసీఆర్ ఆరా తీశారు.

ఈ సమావేశానికి డీజీపీ, ఏసీబీ డీజీ, న్యాయశాఖ కార్యదర్శి, కొందరు న్యాయనిపుణులు హాజరయ్యారు. రెండు గంటలకు పైగా ఈ సమీక్ష కొనసాగింది. గత కొంత కాలంగా ఓటుకు నోటు కేసు మరుగున పడినట్టే కనిపించింది. అయితే, ఈరోజు దీనిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించడం... రాజకీయంగా మళ్లీ చర్చనీయాంశం అయింది. 

More Telugu News