mothukur: ఏపీలో మరో దారుణం .. బాలికపై తాపీకూలీ అత్యాచారం!

  • గుంటూరు జిల్లా మోదుకూరులో ఘటన
  • బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
  • తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు చికిత్స

దాచేపల్లిలో అత్యాచార ఘటనను నిరసిస్తూ ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ అనే నినాదంతో నేడు ఏపీ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో మరో దారుణ సంఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరులో తాపీకూలీగా పని చేస్తున్న నాగూర్ మీరా అనే వ్యక్తి  ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు.

More Telugu News