Madhya Pradesh: ట్విట్టర్ లో కోరగానే... హారాన్ని బహుమతిగా పంపిన నరేంద్ర మోదీ!

  • ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మెడలో హారం 
  • అలాంటిది కావాలని అడిగిన ఐఐటీ ఇంజనీరింగ్ విద్యార్థి
  • వెంటనే పంపించిన నరేంద్ర మోదీ

మధ్యప్రదేశ్ లో గత నెలలో పంచాయతీ రాజ్ దినోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ బంగారం వర్ణంలో వున్న ఓ రకమైన గడ్డితో తయారుచేసిన అందమైన హారాన్ని ధరించారు. ఈ దృశ్యాలను టీవీలో చూసిన ధన్ బాద్ ఐఐటీ విద్యార్థి రబేష్ కుమార్ సింగ్, ట్విట్టర్ లో స్పందిస్తూ, "పంచాయతీ రాజ్ దినోత్సవంలో మీరు బంగారపు రంగులో మెరిసిపోతున్న దండ ధరించారు. నేను దాన్ని పొందవచ్చా?" అని ప్రశ్నించారు.

ఆ ట్విట్టర్ ట్వీట్ ప్రధానికి కూడా చేరింది. కొన్ని రోజులకు ప్రధాని దాన్ని రబేష్ కు పంపించారు. మీ మెసేజ్ ని తాను చూశానని, ఆ దండ మీకు నచ్చిందని తెలుసుకుని దాన్ని పంపుతున్నానని, మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రత్యేక లేఖను కూడా పంపారు. ఇక దండ తనకు చేరగానే రబేష్ ఎంతో ఆనందించి, ఆ దండను మెడలో వేసుకుని సంబరపడ్డాడు.

  • Loading...

More Telugu News