India: భద్రతాదళాల చేతిలో ముగ్గురు తీవ్రవాదుల హతం!

  • చత్తబల్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్
  • ముగ్గురు తీవ్రవాదులను హతం చేసిన భద్రతా దళాలు
  • మూడు ఏకే రైఫిల్స్, మందుగుండు సామగ్రి స్వాధీనం

జమ్మూకశ్మీర్ లోని చత్తబల్ ప్రాంతంలో భద్రతాదళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు తీవ్రవాదులు హతం అయ్యారు. తీవ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఈ పోరులో అసిస్టెంట్ కమాండెంట్ తో సహా ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా గాయపడ్డారు. దాడి జరిగిన ప్రాంతంలో మూడు ఏకే రైఫిల్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చత్తబల్ ప్రాంతంలో తీవ్రవాదుల ఉనికి ఉందని తెలియడంతో భద్రతాబలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ని ప్రారంభించాయని, ఈ క్రమంలోనే భద్రతాబలగాలకు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయని ఓ అధికారి తెలిపారు.

More Telugu News