sp mp: గాంధీ, నెహ్రూలతో జిన్నాను పోల్చి వివాదం రాజేసిన సమాజ్ వాదీ ఎంపీ

  • మన స్వాతంత్య్రం కోసం జిన్నా కూడా పాటు పడ్డారు
  • దాన్ని తోసిపుచ్చరాదు
  • దీనిపై బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోంది

పాకిస్థాన్ పితామహుడు ముహమ్మద్ అలీ జిన్నా పోస్టర్ పై అలీగఢ్ యూనివర్సిటీలో వివాదం నెలకొని స్థానికంగా ఘర్షణలకు దారితీయగా, వాటికి మరింత ఆజ్యం పోసేలా సమాజ్ వాదీ గోరక్ పూర్ ఎంపీ ప్రవీణ్ నిషాద్ వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ మాదిరిగానే జిన్నా కూడా భారత స్వాతంత్య్రానికి పాటు పడినట్టు చెప్పారు. అసలు ఈ అంశంపై వివాదమే అవసరం లేదన్నారాయన. భారతీయ జనతాపార్టీ ఈ అంశంపై రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘‘జిన్నా పేరిట బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోంది. దీన్ని ఖండించాలి. నెహ్రూ, గాంధీ దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడ్డారు. అయితే, జిన్నా కూడా వీరితో సమానంగా మన స్వాతంత్య్రం కోసం పాటు పడిన విషయాన్ని నిరాకరించరాదు’’ అని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News