gopichand: తేజు నో చెప్పిన కథకి ఓకే చెప్పిన యాక్షన్ హీరో!

  • గోపీచంద్ తో చంద్రశేఖర్ యేలేటి 
  • గతంలో ఈ కాంబినేషన్లో రెండు సినిమాలు
  • మూడో సినిమా కోసం సన్నాహాలు

సాయిధరమ్ తేజ్ సినిమాలు సక్సెస్ వైపు చూసి చాలాకాలమే అయింది. దాంతో ఆయన కథల ఎంపిక విషయంలోను .. దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలోను ఒకటికి రెండు మార్లు ఆలోచిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి 'నో' చెప్పేసినట్టు సమాచారం.

 కొన్ని రోజుల క్రితం చంద్రశేఖర్ యేలేటి .. తేజుకి ఒక కథను వినిపించాడట. ఆ సినిమా చేయాలా? వద్దా? అనే విషయంలో తర్జనభర్జనలు పడిన తేజు .. చివరికి నో చెప్పేశాడట. దాంతో చంద్రశేఖర్ యేలేటి ఆ కథను తీసుకుని గోపీచంద్ ను కలవడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయిందట. గతంలో చంద్రశేఖర్ యేలేటి .. గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన 'ఒక్కడున్నాడు' .. 'సాహసం' సినిమాలు అభిమానులను మెప్పించాయి. ఇక ఈ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రానుండటం ఆసక్తిని రేకెత్తించే విషయమే. 

More Telugu News