Andhra Pradesh: నిందితుడు సుబ్బయ్య కుటుంబసభ్యులు వైసీపీ సానుభూతిపరులే!: ఎమ్మెల్యే యరపతినేని

  • సుబ్బయ్య సోదరుడి కొడుకు చిట్టినాయుడు గురజాల వైసీపీ నేత
  • వైసీపీ ఫ్లెక్సీలలో సుబ్బయ్య కుటుంబసభ్యుల ఫొటోలు ఉన్నాయి
  • నిందితుడిని పట్టుకుని తీరతాం

దాచేపల్లి ఘటనలో నిందితుడు సుబ్బయ్య కుటుంబ సభ్యులు వైసీపీ సానుభూతిపరులేనని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని, బాధితురాలి కుటుంబానికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారని అన్నారు.

నిందితుడి కోసం 15 బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నిందితుడు సుబ్బయ్య సోదరుడి కుమారుడు చిట్టినాయుడు గురజాల వైసీపీ నాయకుడని, వైసీపీ ఫ్లెక్సీలలో సుబ్బయ్య కుటుంబసభ్యుల ఫొటోలు ఉన్నాయని, నిందితుడిని పట్టుకుని తీరతామని చెప్పారు.

More Telugu News