charmi: 'మెహబూబా' సెన్సార్‌ పూర్తి.. హ్యాపీగా ఉందన్న ఛార్మీ

  • యూ/ఏ సర్టిఫికెట్‌ పొందిన పూరీ కొత్త చిత్రం
  • సెన్సార్‌ సభ్యులందరికీ ఈ సినిమా బాగా నచ్చిందన్న ఛార్మీ
  • ఆకాశ్ చాలా బాగున్నాడని చెప్పారని వ్యాఖ్య

తన కుమారుడు ఆకాశ్‌ హీరోగా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ రూపుదిద్దిన 'మెహబూబా' సినిమా ఈ రోజు సెన్సార్‌ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్‌ పొందింది. ఈ సినిమాను ఈ నెల 11న విడుదల చేయనున్నారు. హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు.. శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్‌ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా సినీ నటి ఛార్మీ.. తనకు చాలా హ్యాపీగా ఉందంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. తమ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుందని, సెన్సార్‌ సభ్యులందరికీ ఈ సినిమా బాగా నచ్చిందని చెప్పింది. ఆకాశ్ చాలా బాగున్నాడని, లవ్‌ స్టోరీ చాలా బాగుందని సెన్సార్‌ సభ్యులు తమతో పదే పదే చెప్పడం తమకు చాలా ఎనర్జీనిచ్చిందని తెలిపింది.    

More Telugu News