Akun Sabharwal: తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అకున్‌ సభర్వాల్

  • ఆ శాఖ అధికారులతో భేటీ
  • పౌరసరఫరాల శాఖలో ఐటీ ప్రాజెక్టుల అమలు తీరుపై సమీక్ష
  • పలు సూచనలు చేసిన అకున్‌ సభర్వాల్

తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపీఎస్‌ అధికారి అకున్‌ సభర్వాల్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధికారులతో పాటు, పౌర సరఫరాల సంస్థ, లీగల్‌ మెట్రాలజీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ మూడు విభాగాలకు సంబంధించి కార్యకలాపాలను సమీక్షించారు. పౌరసరఫరాల శాఖలో ఐటీ ప్రాజెక్టుల అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించి, రేషన్ బియ్యం తరలించే వాహనాల కదలికలను, గోదాముల్లో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ- పాస్‌ యంత్రాల పనితీరు, ఈ- వెయింగ్‌ మిషన్‌, టీ-రేషన్‌ యాప్‌, రేషన్‌ పోర్టబిలిటీ వంటి వాటి గురించి కమిషనర్‌కి ఐటీ అధికారులు వివరించారు. అనంతరం వినియోగదారుల ఫోరం, పౌర సరఫరాల శాఖ హెల్ప్‌లైన్, టోల్‌ ఫ్రీ నెంబరు, వాట్సప్‌ కంట్రోల్ రూమ్ పనితీరులను అడిగి తెలుసుకున్నారు.

ఏ అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయనే దానిపై సంబంధిత అధికారులను అడిగారు. ఫిర్యాదులకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు తనకు అందించాలని, రేషన్‌ బియ్యాన్ని తరలించే వాహనాల కదలికల వివరాలను ఎప్పటికప్పుడు తనకు అందించాలని అధికారులను ఆదేశించారు.       

  • Loading...

More Telugu News