nagarjuna: 'ఆఫీసర్' నుంచి సెకండ్ టీజర్ సిద్ధం .. రేపే రిలీజ్!

  • వర్మ దర్శక నిర్మాతగా 'ఆఫీసర్'
  • నాగ్ సరసన మైరా సరీన్ 
  • ఈ నెల 25వ తేదీన విడుదల

రామ్ గోపాల్ వర్మ దర్శక నిర్మాతగా రూపొందించిన 'ఆఫీసర్' అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన మైరా సరీన్ కనిపించనుంది. నాగార్జున పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా నుంచి, ఇంతకు ముందు ఒక యాక్షన్ టీజర్ ను వదిలారు. ఆ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

దాంతో రేపు సాయంత్రం 6 గంటలకు మరో టీజర్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా ఈ టీజర్ ఉండేలా వర్మ జాగ్రత్తలు తీసుకున్నాడని అంటున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'శివ'ను మించి ఈ సినిమా ఉంటుందని వర్మ చెప్పడంతో, అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. 

More Telugu News