Karnool Dist: కోట బురుజులు, గోడలు బద్దలు... చెన్నంపల్లి కోటలో శరవేగంగా నిధి అన్వేషణ!

  • నాలుగో విడత తవ్వకాలు ప్రారంభం
  • మూడు రోజులుగా సాగుతున్న అన్వేషణ
  • భారీ యంత్రపరికరాలతో తవ్వకాలు
కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గుత్తి రాజులు దాచి ఉంచారని భావిస్తున్న భారీ నిధి నిక్షేపాలను వెలికి తీయడానికి ప్రభుత్వ అధికారులు, గనుల శాఖ ఆధ్వర్యంలో జరుపుతున్న తవ్వకాలు శరవేగంగా సాగుతున్నాయి. నాలుగో విడత తవ్వకాలు గత మూడు రోజులుగా సాగుతుండగా, భారీ యంత్ర పరికరాలతో కోట బురుజులు, గోడలను బద్దలు కొడుతున్నారు.

 బురుజుల నుంచి భూ గృహాలకు దారి ఉండవచ్చన్న ఆలోచనతో ఈ పని చేస్తున్నట్టు సమాచారం. ఇంతవరకూ కోటలో ఎటువంటి నిధి జాడ తెలియరాకపోయినా, స్కానర్లతో పరిశీలిస్తుంటే లోహం కనిపిస్తుండటంతో, అధికారుల ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరలో లోహపు ఆనవాళ్లు ఉన్నాయని భావిస్తున్న ప్రాంతానికి దారి కనుగొంటామని అధికారులు అంటున్నారు.
Karnool Dist
Chennampalli Fort
Gutti Dynasty
Treasure

More Telugu News