daiwa tv: ఎంఐ టీవీకి పోటీ ‘దైవా’... 4కే 55 అంగుళాల టీవీ రూ.37వేలకే

  • ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ
  • స్క్రీన్ క్యాప్చర్, పిక్చర్ ఎన్ హాన్స్ మెంట్ ఫీచర్లు
  • 8జీబీ స్టోరేజీ, 1జీబీ ర్యామ్

షియోమీకి చెందిన ఎంఐ టీవీకి పోటీగా మరో టీవీ దేశంలో అడుగు పెట్టింది. వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ గ్రూపులో భాగమైన దైవా 55 అంగుళాల సైజు కలిగిన 4కే స్మార్ట్ టీవీ మోడల్ (డీ55యూవీసీ6ఎన్)ను విడుదల చేసింది. దీని ధర రూ.36,999. ఏ+ గ్రేడ్ ప్యానెల్ ఇందులో ఉంటుంది. మరింత స్పష్టతతో చూసేందుకు ఇది అనుకూలిస్తుంది.

స్క్రీన్ క్యాప్చర్, కాంబ్ ఫిల్టర్, పిక్చర్ ఎన్ హాన్స్ మెంట్ ఫీచర్లతో వస్తుంది. డాల్బీ సౌండ్ టెక్నాలజీని ఇందులో ఏర్పాటు చేసినట్టు కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 4కే స్మార్ట్ టీవీ అయిన ఇందులో 8జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 1జీబీ ర్యామ్, హెచ్ డీఎంఐ, యూఎస్ బీ, ఈథర్ నెట్ పోర్ట్ లు కూడా ఉంటాయి. ఎంఐ 55 అంగుళా 4కే స్మార్ట్ టీవీ ధర మొన్నటి వరకు రూ.39,999గా ఉండగా, దాన్ని రూ.44,999కు పెంచిన విషయం తెలిసిందే. దీంతో దైవా ఎంఐకి పోటీ ఇవ్వనుంది. 

More Telugu News