nithin: 14 యేళ్ల తరువాత దిల్ రాజు తో నితిన్

  • షూటింగు దశలో 'శ్రీనివాస కల్యాణం'
  • పంజాబ్ లోని పాటియాలలో చిత్రీకరణ 
  • కథానాయికగా రాశి ఖన్నా  

ప్రస్తుతం నితిన్ .. దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కల్యాణం' సినిమా చేస్తున్నాడు. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, పంజాబ్ లోని పాటియాలలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధానమైన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా నటిస్తోంది. జూలై 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

కెరియర్ తొలినాళ్లలో నితిన్ 'దిల్' సినిమా చేశాడు. 'దిల్'ను నిర్మించిన కారణంగానే అది ఆ నిర్మాత ఇంటిపేరుగా మారిపోయింది. మళ్లీ ఇంతకాలానికి 'దిల్' రాజు నిర్మాణంలో నితిన్ ఈ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు ఇంతకుముందు సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన 'శతమానం భవతి' భారీ విజయాన్ని అందుకుంది. అందువలన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.  

More Telugu News