వన్డే క్రికెట్ మ్యాచ్లా ఒక్కసారి లోక్ సభలో మాట్లాడారు!: గల్లా జయదేవ్కి జనసేన చురక
- ఇప్పుడు ప్రత్యేక హోదాపై మౌనం పాటిస్తున్నారు
- కారణమేంటో తెలుగు ప్రజలకు తెలుసు
- ప్రత్యేక హోదా తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు
'వన్డే క్రికెట్ మ్యాచ్లా ఒక్కసారి లోక్ సభలో ప్రత్యేక హోదాపై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా జయదేవ్ గారూ.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. కొత్త సినిమా.. కథ-డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి.. ప్రత్యేక హోదా తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు' అని పేర్కొంది.