Telangana: తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

  • టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం
  • ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 83.78 గా నమోదు
  • బాలికల ఉత్తీర్ణత శాతం 85.14  కాగా, బాలురది 82.46 శాతం
  • జూన్ 4 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు  

తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ, మొత్తం 2125 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని, ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 83.78 గా నమోదైందని, బాలికలు పైచేయి సాధించారని చెప్పారు. బాలికల ఉత్తీర్ణత శాతం 85.14  కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 82.46 శాతంగా ఉందని అన్నారు.

టెన్త్ ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో జగిత్యాల, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలు నిలవగా, చివరి స్థానంలో ఆదిలాబాద్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షలను మొత్తం 5,34,726 విద్యార్థులు రాశారు. కాగా, ప్రైవేట్ పాఠశాలల కన్నా రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు మెరుగైన ఫలితాలు సాధించాయి. 21 ప్రభుత్వ పాఠశాలల్లో సున్న శాతం ఉత్తీర్ణత లభించడం గమనార్హం. జూన్ 4 నుంచి 19వ తేదీ వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 21 ఆఖరు తేదీగా నిర్ణయించారు.

More Telugu News