TRS: పార్టీ కోసం భారీగా విరాళాలు ప్రకటించిన టీఆర్‌ఎస్ నేతలు!

  • ఈ రోజు టీఆర్‌ఎస్ 17వ ప్లీనరీ
  • విరాళాలు ప్రకటించిన పలువురు పార్టీ నేతలు
  • టీఆర్‌ఎస్ పార్టీ ఫండ్ మొత్తం రూ.42 కోట్ల 8 లక్షలు

ఈ రోజు హైదరాబాద్ శివారు కొంపల్లిలో ప్రారంభమైన 17వ ప్లీనరీ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్ నాయకులు తమ పార్టీ కోసం రూ. 20 కోట్ల 41 లక్షల విరాళాలు ప్రకటించారు. ఇప్పటివరకు టీఆర్‌ఎస్ పార్టీ ఫండ్ రూ. 21 కోట్ల 67 లక్షలుగా ఉండేది. కాగా తాజా విరాళాలతో కలిపి రూ. 42 కోట్ల 8 లక్షలకు చేరిందని సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలోనే ఆ వివరాలను ఇన్‌కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ కు సమర్పిస్తామని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.

విరాళాలు ప్రకటించిన టీఆర్‌ఎస్ నాయకుల పేర్లు:

  • ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ.2 కోట్లు
  • రవీందర్‌రెడ్డి రూ. 2 కోట్లు
  • ఎంపీ మల్లారెడ్డి రూ. కోటి
  • ఎమ్మెల్సీ సలీం రూ. కోటి
  • ఎమ్మెల్సీ భానుప్రసాద్ రూ. కోటి
  • ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి రూ. కోటి
  • ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి రూ. కోటి
  • ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూ. 75 లక్షలు
  • ఎంపీ బీబీ పాటిల్ రూ. 51లక్షలు
  • దండె విఠల్ రూ. 50 లక్షలు
  • ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రూ. 50 లక్షలు
  • ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రూ. 50 లక్షలు
  • కొత్త మహేందర్‌రెడ్డి రూ. 50 లక్షలు
  • ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రూ. 40 లక్షలు
  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రూ. 25 లక్షలు
  • రామ్మోహన్‌రావు రూ. 25 లక్షలు
  • పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రూ. 25 లక్షలు
  • గుండు సుధారాణి రూ. 25 లక్షలు
  • మహేశ్ బిగాల రూ. 25 లక్షలు,
  • ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి రూ. 25 లక్షలు,
  • ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రూ. 25 లక్షలు,
  • ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రూ. 25 లక్షలు
  • ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రూ. 25 లక్షలు
  • ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రూ. 25 లక్షలు
  • ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రూ. 25 లక్షలు

More Telugu News