Chandrababu: మంత్రి అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్‌

  • సీనియర్లను కలుపుకుని వెళ్లాలని సూచన
  • పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సుబ్బారెడ్డికి భరోసా
  • సుబ్బారెడ్డి పోటీ రాజకీయం చేస్తున్నారన్న అఖిలప్రియ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద ఆళ్లగడ్డ రాళ్లదాడి పంచాయితీ ముగిసిన విషయం తెలిసిందే. మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలతో చంద్రబాబు.. విడివిడిగా, ఉమ్మడిగానూ చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అఖిల ప్రియ.. ఏవీ సుబ్బారెడ్డి పోటీ రాజకీయం చేస్తున్నారని, అలాగే ఆయన కుమార్తె కూడా తనపై విమర్శలు చేశారని చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి.. చంద్రబాబు ముందు రాళ్లదాడికి సంబంధించిన ఆధారాలను ఉంచారు. ఈ విషయంపై అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. సీనియర్లను కలుపుకుని ముందుకు వెళ్లాలని తెలుపుతూ అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్‌ తీసుకున్నారు. అలాగే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు చెప్పారు.

More Telugu News