pruthvi: నాకు రాలేదని కాదు .. ఆ పెద్దాయనకి అవార్డు రాకపోవడం చాలా బాధ కలిగించింది: కమెడియన్ పృథ్వీ

  • నంది అవార్డు వస్తుందనుకున్నాను 
  • రాకపోయేసరికి మనసు చివుక్కుమంది 
  • కైకాల విషయంలోనే బాధపడ్డాను  

హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న పృథ్వీ, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సమయంలోనే ఆయన నంది అవార్డులను గురించి ప్రస్తావించారు. " లౌక్యం' సినిమాకి సంబంధించి  ఉత్తమ హాస్యనటుడిగా నాకు నంది అవార్డు వస్తుందని నేను భావించాను. ఆ సినిమా దర్శక నిర్మాతలు కూడా అదే నమ్మకంతో వున్నారు. నాకు రాలేదని తెలిసి మనసు చివుక్కుమంది. అవార్డు కమిటీకి నేను కనపడలేదేమోనని సరిపెట్టుకున్నాను.

కానీ కైకాల సత్యనారాయణ గారి విషయంలో అలా సర్దుకుపోలేక పోయాను . ఎన్టీఆర్ కి ఆయన ఎంతో ఇష్టమైన నటులు .. ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అంతటి గొప్ప నటుడికి ఎన్టీఆర్ అవార్డు రాకపోవడం మాత్రం నాకు చాలా బాధను కలిగించింది. ఆ అవార్డు కైకాలకి వచ్చి వుంటే .. ఎన్టీఆర్ తో ఆయనకి గల అనుబంధం .. అనుభవాలు భావితరాల వారికి తెలిసే అవకాశం వుండేది" అని చెప్పుకొచ్చారు.     

More Telugu News